తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం నెహ్రూ నగర్కు చెందిన తగరం ముత్యాలరావు స్థానిక కెమిలాయిడ్స్ కర్మాగారంలో పనిచేసేవాడు. అతని భార్య శ్యామల అదే గ్రామానికి చెందిన తగరం వెంకటేశ్వర్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాదు ప్రియుడుతో కలిసి భర్తను మానసికంగా హింసించింది. దీంతో మనస్థాపం చెందిన తగరం ముత్యాలరావు 2018 జులై 31 కెమిలాయిడ్స్ కర్మాగారం వెనుక ఉన్న మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి తన భార్య శ్యామల తో పాటు ఆమె ప్రియుడు తగరం వెంకటేశ్వర్లు , కారణమని సూసైడ్ నోట్ రాశాడు. దాని ప్రకారం ఆనాటి ఎస్సై వేల్పుల వెంకటేశ్వరరావు 14 మంది పై Cr. No. 178/2018 U/Sec. 306 r/w 34 ipc కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వాదోపవాదములు అనంతరం ఈ కేసులో నిందితులైన శ్యామలకు ఏడు సంవత్సరాల కట్టిన కారాగార శిక్ష, ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావుకు పది సంవత్సరాలు కఠిన కారాగారి శిక్ష, అతని బంధువులు తగరం పుల్లారావుకు ఐదు సంవత్సరాల కారాగారి శిక్ష, రామారావు, నరసింహులకు మూడు సంవత్సరాల కారాగారి శిక్ష తో పాటు నిందితులందరికీ రూ.10 వేలు జరిమానా విధిస్తూ కొత్తగూడెం అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కవిత బుధవారం తీర్పును వెలువడించారు. నిందితులకు శిక్ష పడటంలో కృషిచేసిన కోర్టు కానిస్టేబుల్ బి నాగేశ్వరరావు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కె రాజారావు మరియు పివిడి లక్ష్మి లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రశంసించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ