తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం లీగల్ ఇటీవల జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 30ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పాల్వంచ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది కిరణ్ కుమార్ ముదలక్కర్ బుధవారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్ నందు ఎన్నికల అధికారి పలివెల గణేష్ బాబు నుండి భాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరిని సమన్వయం చేసుకుంటూ,న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రణాళిక బద్దంగా పనిచేస్తానని,నూతన జిల్లా కోర్ట్ భవన నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.అనంతరం గెలుపొందిన బార్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా,ప్యానెల్ లో గెలుపొందిన వివిధ హోదాల్లోని సభ్యులు తమ పదవులకు వన్నె తెచ్చేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు.కిరణ్ కుమార్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు కాటూరి సంజీవ్ రావు,శషాజన్ పర్వీన్,జిల్లా ప్రధాన కార్యదర్శి గడిపెల్లి మహేష్,సంయుక్త కార్యదర్శి గడదాస్ నాగరాజు,గ్రంథాలయ కార్యదర్శి దొడ్డ ప్రసాద్,కోశాధికారిగా గుళ్ళ సంధ్యరాణి క్రీడలు మరియు సంస్కృతిక విభాగం కార్యదర్శులుగా బానోత్ దేవదాస్,నకిరికంటి ఉమా,మహిళ ప్రతినిధిగా నిమ్మలురి ఉషారాణి లు నియామకపాత్రలు స్వీకరించారు.మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కిరణ్ కుమార్ ప్యానెల్ నుండి పోటీచేసిన 9 మంది గెలుపొందారు.ఈకార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జీ.వి.కే మనోహర్,బాబురావు,ఉటుకురి పురుషోత్తం,పలివేల సాంబశివరావు,ఆర్.విజయ్ కుమార్,లక్కినేని సత్యనారాయణ,రమేష్ కుమార్ మక్కడ్,గాజుల రామ్మూర్తి,అనుబ్రోలు రాంప్రసాద్,భాగం మాధవరావు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ