Sunday, 19 April 2026 01:53:52 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

స్వచ్ఛదనం - పచ్చదనం

Date : 08 August 2024 08:48 PM Views : 385

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 5వ తేదీ నుంచి జరుగుతున్న "స్వచ్చదనం - పచ్చదనం" కార్యక్రమమును పరిశీలించుటకు నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి వీపీ గౌతమ్ గురువారం భద్రాద్రి కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా విద్యానగర్ గ్రామపంచాయతీలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ( వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత )ని పరిశీలించారు. ఆ యొక్క ఇంకుడు గుంతని ఏ విధంగా తయారు చేశారు , దానికి పట్టిన వరలెన్నీ, నీరు ఎలా ఇంకుతుంది అనే విషయాలని క్షుణ్ణంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రుద్రoపూర్ గ్రామపంచాయతీలోని హైస్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి మెడిసినల్ ప్లాంట్స్, టాల్ ప్లాంట్స్, స్కూల్ గార్డెన్,కమ్యూనిటీ ప్లాంటేషన్ మొక్కల విశిష్టతను జిల్లా కలెక్టర్ ను గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులకు జిల్లా కలెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి గౌతమ్ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి అభినందించారు.

అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పశు సంతతి నియంత్రణ కేంద్రం (యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ) సందర్శించి అక్కడ తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 27వ వార్డులోని ప్రగతి మైదానంలో మొక్కలు నాటారు. అనంతరం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం కూడా గ్రామాలు పట్టణాలలో అదే ఉత్సాహంతో కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విద్యాచందన , జిల్లా పంచాయతీ అధికారి వి చంద్రమౌళి, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి రమణ రావు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ మరియు ఎంపీడీవో చుంచుపల్లి విడివి అశోక్ కుమార్ , మండల పంచాయతీ అధికారి గుంటి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు సంజీవరెడ్డి, సత్యనారాయణ , నరేందర్ నాని, రమేష్ మొదలగువారు మరియు ఈజీఎస్ ఏపీవో రఘుపతి, ఏపిఎం రామకృష్ణ , ఈజీఎస్ ఈసి నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామపంచాయతీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :