Sunday, 19 April 2026 02:23:57 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి

Date : 24 November 2025 06:04 PM Views : 129

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల "హక్కులను కాలరాసేందుకు, భారత పారిశ్రామిక రంగాన్ని దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించేందుకు దోపిడీ శక్తులకు ఎదురు లేకుండా చేయడానికే కేంద్ర ప్రభుత్వం నూతనంగా 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని కార్మికసంఘాల నాయకులు మండిపడ్డారు. సోమవారం పట్టణంలోని శేషగిరిభవన్ లో కార్మిక నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్లుగా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గతంలో కేంద్రం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక సంఘాలన్నీ ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల కోసమే కేంద్రం పనిచేస్తుందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోడ్ లను అనుమతించమని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష యూనియన్ ల ఆధ్వర్యంలో ఈ నెల 25న అన్ని గనుల డిపార్టుమెంట్లలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, ఈ నెల 26 ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్లకు మెమోరండాలు ఇవ్వడం, అదే రోజు సాయంత్రం 3.30కు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నా చేసే కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు అన్ని సంఘాల కార్యకర్తలు, నాయకులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎఐటీయుసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్యనాయకులు టిబిజికెఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు సారయ్య సీఐటీయూ నాయకులు మంద నర్సింహా రావు,intuc నాయకులు ఆల్బర్ట్, ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి, సిఐటియు, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు పీతాంబరం, క్రిస్టోఫర్, వంగా వెంకట్, రమణ మూర్తి, తుమ్మ శ్రీను,జాఫర్, అశోక్, సూర్య నారాయణ, రవి,ఐలయ్య, వీరస్వామీ, రాములు, మధుసూదన్, జాన్సన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :