తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలు పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్ మరియు బోరెడ్డి అయోధ్య రెడ్డి జిల్లా పర్యటన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా, జూలై 31 (గురువారం) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు అన్ని శాఖల ప్రజా సమాచార అధికారులు (PIOలు) మరియు అప్పిలేట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడుతుందని, అలాగే మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అప్పీలు దారుల తో విచారణ కలెక్టర్ పేర్కొన్నారు.ఆగస్టు 1 (శుక్రవారం) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మరో విడత ఆర్టీఐ అప్పీల్ విచారణలు జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడతాయని వివరించారు.ఈ సందర్బంగా, అన్ని శాఖల పి ఐ ఓ లు మరియు అప్పిలేట్ అధికారులు 6(1) కింద దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుల రసీదులు, ప్రశ్నలు, సమాధానాలు, అవసరమైన పాయింట్వారీ కౌంటర్ సమాచారంతో విచారణలకు తప్పకుండా హాజరుకావలసినదిగా కలెక్టర్ ఆదేశించారు. అన్ని విభాగాల పి ఐ ఓలు మరియు ఏ ఏ లు ఇంటరాక్షన్ సెషన్కు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకత పెంపొందించడంలో భాగంగా, ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డులను మార్గదర్శకాల ప్రకారం నవీకరించి, ప్రదర్శించాలనీ, ఇందుకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ