Sunday, 19 April 2026 01:58:03 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

Date : 28 January 2025 12:56 PM Views : 354

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…. జనవరి 29 నుండి ఫిబ్రవరి 22 వరకు జరిగే ప్రాక్టికల్ పరీక్షలు మరియు మార్చి 5 నుంచి 25 వరకు జరిగే పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో 10173 మంది రెండవ సంవత్సరం 10,062 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో 65 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు రెండు సెక్షన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, మెడికల్ శిబిరాలు, ఆర్టీసీ బస్ సౌకర్యాలు కల్పించాలని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో 144 సెక్షన్ అమలు తప్పక ఉండాలని , కేంద్రాల దగ్గరలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని సూచించారు. ఏ ఒక్క కేంద్రంలో సెల్ ఫోన్ అనుమతించ వద్దని, పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు మానసిక వికాస తరగతులను నిర్వహించి వారిలో పరీక్షల పట్ల ఉన్న భయాందోళన తొలగించాలని అన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించి నూరు శాతం ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సిహెచ్. వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఏ ఆర్ డి ఎస్ పి సత్యనారాయణ ,టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి , ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ అరవింద్ బాబు, జిల్లా అధికారులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :