Wednesday, 15 April 2026 05:19:11 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 13 April 2026 07:28 PM Views : 78

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సెన్సస్‌కు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రంలో సెన్సస్–2027 ఏర్పాట్లపై డీసీఓ భారతి హోళీకేరి సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక చార్జ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు అన్ని జిల్లాలు సమర్పించాల్సి ఉండగా, కొన్ని జిల్లాలు మాత్రమే వివరాలు అందించాయని, మిగతా జిల్లాలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు.ఇళ్ల గణనకు సంబంధించి జిల్లా, మండల స్థాయిలో భూభాగ గణాంకాల్లో ఉన్న వ్యత్యాసాలపై కూడా చర్చించారు. వివిధ వనరుల నుండి వచ్చిన డేటాలో ఒకే డేటాను ఖరారు చేసి, జిల్లా సెన్సస్ అధికారి ద్వారా ధృవీకరించి పంపించాలని సూచించారు. ఇతర మార్గాల ద్వారా పంపిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.ఎన్యూమరేటర్ల మాన్యువల్స్, సూపర్వైజర్ కిట్స్, మ్యాప్స్ వంటి సెన్సస్ సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. చార్జ్ అధికారులకు నేరుగా పంపబడే ఈ సామగ్రిని స్వీకరించి, పరిమాణాన్ని ధృవీకరించాలని సూచించారు. అలాగే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి, వంద శాతం లక్ష్యంతో పాటు అదనపు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.సెన్సస్–2027 కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని డీసీఓ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఐడీఓసీ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో సెన్సస్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే విస్తృత స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సెన్సస్‌కు సంబంధించిన ప్రతి దశను సమయపాలనతో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల మధ్య సమన్వయం కల్పిస్తూ పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు.ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసి, వారికి సమగ్ర శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా పర్యవేక్షణ చేపడుతున్నామని, అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు .సెన్సస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, డేటా ఖచ్చితత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :