తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక,సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను మరియు కళాశాలను ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది.ముందుగా తరగతి గదులకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించి,విద్యార్థులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థుల అందరితో సమావేశమయ్యారు.హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు కష్టపడి చదువుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్దగా విని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరేలా మెలగాలని తెలియజేశారు.మన తల్లిదండ్రులను చదువు చెప్పే గురువులను జీవితంలో ఏ స్థాయికి చేరినా మరువకూడదని తెలిపారు.చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని సూచించారు.సినిమాలలో చూపించే మంచిని మాత్రమే తీసుకొని ఆ మార్గంగా స్ఫూర్తిని పొందాలని,హీరో లాగా నిజజీవితంలో ఫీలయ్యి చెడు మార్గంలో నడిస్తే చివరికి జీరో అవుతారని అన్నారు.అనంతరం వంటశాలను స్టోర్ రూమ్ మరియు డైనింగ్ హాలును పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కొత్త మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజన కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి,అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ