Friday, 17 April 2026 06:36:46 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ సాంఘీక,సంక్షేమ బాలురా ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలను తనిఖీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 21 December 2024 07:26 PM Views : 826

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక,సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను మరియు కళాశాలను ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది.ముందుగా తరగతి గదులకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించి,విద్యార్థులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థుల అందరితో సమావేశమయ్యారు.హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు కష్టపడి చదువుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్దగా విని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరేలా మెలగాలని తెలియజేశారు.మన తల్లిదండ్రులను చదువు చెప్పే గురువులను జీవితంలో ఏ స్థాయికి చేరినా మరువకూడదని తెలిపారు.చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలని సూచించారు.సినిమాలలో చూపించే మంచిని మాత్రమే తీసుకొని ఆ మార్గంగా స్ఫూర్తిని పొందాలని,హీరో లాగా నిజజీవితంలో ఫీలయ్యి చెడు మార్గంలో నడిస్తే చివరికి జీరో అవుతారని అన్నారు.అనంతరం వంటశాలను స్టోర్ రూమ్ మరియు డైనింగ్ హాలును పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కొత్త మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజన కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి,అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :