Thursday, 25 June 2026 08:03:29 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

తక్షణమే రైతు భరోసా నిధులు జమ చేయాలి : ఏఐకెఎస్ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్

Date : 22 June 2026 04:55 PM Views : 33

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పోడు రైతులకు పెండింగ్ పట్టాలు ఇవ్వాలి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలి నకిలీ విత్తన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలి : ఏఐకెఎస్ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్ ప్రస్తుత వానాకాలం సీజన్ ప్రారంభమైనందున అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 'రైతు భరోసా' పెట్టుబడి సాయం నిధులను ఆలస్యం చేయకుండా తక్షణమే జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకెఎస్) జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, సిపిఐ చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల కార్యదర్శులు వాసిరెడ్డి మురళి, దీటి లక్ష్మీపతి డిమాండ్ చేశారు. వివిధ రైతు సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఏఐకెఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి, అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేర్వేరుగా జరిగిన ధర్నా కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ.. జిల్లాలో సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర పోడు రైతులకు పెండింగ్‌లో ఉన్న పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలని, పట్టాలు పొందిన రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసి రుణ అర్హత కల్పించాలన్నారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక లోపాల వల్ల వందలాది మంది రైతుల భూములు పార్ట్-బి లోనో, లేదా ఇతరుల పేర్ల మీదో తప్పుగా నమోదయ్యాయని, ఈ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక చొరవతో, త్వరితగతిన పరిష్కరించి రైతులకు హక్కులు కల్పించాలని కోరారు. గతంలో ప్రకటించిన పంట రుణమాఫీ పథకం సాంకేతిక కారణాల వల్ల మండలంలో చాలా మంది రైతులకు వర్తించలేదని, అర్హత ఉండి ఉమ్మడి ఖాతాలు, రేషన్ కార్డ్ లింకేజ్ సమస్యల వల్ల ఆగిపోయిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలన్నారు. ప్రస్తుత సాగు సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను ముంచుతున్న దళారులు, ప్రైవేట్ వ్యాపారులపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, గెడ్డాడు నగేష్, నేరెళ్ల రమేష్, నాగయ్య, శాపావత్ రవి, రామారావు, ఎర్రబెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :