Thursday, 25 June 2026 08:03:28 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 23 June 2026 05:33 PM Views : 15

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జగన్నాధపురం రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. మంగళవారం పాల్వంచ మండలం జగన్నాధపురం రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మేళాలో ఏర్పాటు చేసిన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి, విత్తనాల ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి వాటి ప్రామాణికతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన, నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాల్లో సన్న రకాల వరి విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలోని 43 రైతు వేదికల ద్వారా విత్తన మేళాలు నిర్వహిస్తున్నామని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. యూరియా బుకింగ్‌ను కూడా యాప్ ద్వారా నిర్వహిస్తున్నామని, రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూరియా బుకింగ్ యాప్, విత్తనమేలపై రైతులలో అవగాహన కలిగించాలని వ్యవసాయ శాఖ అధికారులని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయం, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, వ్యవసాయ అవసరాలన్నీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విత్తన మేళా ద్వారా విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు, యూరియా బుకింగ్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు కలెక్టర్ చేతులమీదుగా విత్తనాలు, యూరియా అందించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సోసిటీ ఛైర్మెన్ కొత్వాల శ్రీనివాస్, తాసిల్దార్ ధారా ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: