తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : మండలంలోని అశోక్ నగర్ ముర్రేడు వాగులో గత నెల(మే) 19న ఈతకు వెళ్లి సోమశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. నిబంధనలకు విరుద్ధంగా వాగులో విద్యుత్ మోటార్ అమర్చడం వల్ల విద్యుత్ షాక్ తో తమ కొడుకు మరణించాడని మృతుడి తల్లిదండ్రులు అన్నారు. పోలీసులు సరైన విచారణ జరపకుండా ఈత రాక నీళ్లు మింగి చనిపోయాడని ధ్రువీకరించడం సరికాదన్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు ఫిర్యాదు చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ