తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం.ఐక్యతతోనే మహిళా లోకం తమ హక్కులను సాధించుకోవాలి.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టాలి. మహిళా హక్కుల రక్షణకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది.మహిళల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలి.భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టడంతో పాటు వారి హక్కుల రక్షణకై చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి అన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె సమాఖ్య జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ.. మహిళా సమాఖ్య సుదీర్ఘ కాలంగా మహిళల అభ్యున్నతి కోసం చేసిన సేవలను, నిర్వర్తించిన బాధ్యతలను గుర్తుచేశారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని, మహిళా చట్టాల అమలులో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల దొంగాట ఆడిందని, మహిళలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటోందని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, హక్కుల సాధన కోసం మహిళా లోకమంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మజ, ధనలక్ష్మి, రత్నకుమారి, గోనె మని, లక్ష్మి, మంద నిర్మల,శాంతి, మేదిని లక్ష్మి, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ