తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జూలూరుపాడు మండల నివాసి సీనియర్ జర్నలిస్ట్ బాపట్ల మురళి ని రాష్ట్ర మున్నూరు కాపు జాయింట్ సెక్రటరీగా సంఘం నాయకులు నియమించారు. ఈ సందర్భంగా బాపట్ల మురళి మాట్లాడుతూ మున్నూరు కాపుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. జనాభా ప్రాతిపదికన మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రాజకీయపరంగా వెనుకబడ్డారని పేర్కొన్నారు. మున్నూరుకాపులు ఐక్యంగా ఉండాలని, మండలంలో మున్నూరు కాపు కళ్యాణ మండపం ఏర్పాటుకు కృషి చేస్తాననిపేర్కొన్నారు. తనకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించిన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కు, రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తమరావు పటేల్ కు ధన్యవాదములు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ