తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను అదుపు చేసుకోవచ్చని పలువురు వక్తలు అన్నారు.శనివారం ప్రకృతి ఆశ్రమంలో అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని ఘనంగాజరుపుకున్నారు..ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..మనం శారీరకంగా బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుందన్నారు. 2025 సంవత్సరానికి గాను, యోగా నినాదాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే భూమిని కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.యోగా వలన శరీర సమతుల్యత ఏర్పడుతుందనీ, స్వయం ప్రతిబంధక వ్యాధులు కంట్రోల్ లో ఉంటాయనీ,శ్వాసక్రియ కూడా నిలకడగా ఉంటుందన్నారు.శరీరంలో ఉన్న అవయవాల అన్నిటికీ రక్తప్రసరణ మెరుగవుతుందనీ, వెన్నెముక దృఢత్వం పెరుగుతుందనీ,నిత్యం పనుల ఒత్తిడితో సతమతమయ్యే వారి మనసుకి సాంత్వన చేకూరుతుందనీ వెల్లడించారు.సంపూర్ణ ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, సమాజ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే యోగాని సొంతం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి అతిథులుగా పాల్గొని మాట్లాడినవారిలో.. సింగరేణి ఏజీఎం గోనె శ్రీకాంత్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సంఘం వెంకట పుల్లయ్య, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, సింగరేణి రిటైర్డ్ జిఎం శనగ వెంకటేశ్వర్లు, ప్రముఖ వైద్యులు కనకరాజు, టేకులపల్లి సిడిపిఓ తార, రిటైర్డ్ సిడిపిఓ కనకదుర్గ లు మాట్లాడగా, రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ తిరుపాలు, ఆశ్రమం కో_ఆర్డినేటర్, యోగ ఇన్స్ట్రక్టర్ సుగుణ రావు, ఆశ్రమం సభ్యులు కే హెచ్ ప్రసాద్, కుమార్, జంపన్న, రాజేష్, విష్ణు కుమార్ పంచార్య, రాజమణి, శివ, శోభారాణి, స్వరూప, ఉమా , పిచ్చయ్య పాల్గొన్నారు. యోగ ఆసనాలను ప్రోటోకాల్ ప్రకారం సీనియర్ యోగ మాస్టర్ రాజేంద్రప్రసాద్, సుగుణారావులు చేయించగా, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో మొక్కను నాటారు.
Admin
తెలుగు వెలుగు టీవీ