Tuesday, 26 May 2026 11:25:38 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యం.శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తేనే రైతులకు అధిక దిగుబడి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 04 May 2026 08:06 PM Views : 113

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యం.శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తేనే రైతులకు అధిక దిగుబడి, ఆదాయం.అవసరానికి మించి రసాయనాలు వాడి భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దు.మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే వేయాలి.యువత వ్యవసాయ రంగంపై ఆసక్తి పెంచుకుని దేశానికి వెన్నుముకగా నిలవాలి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. నేల పరీక్షలతోనే లాభదాయకమైన సాగు సాధ్యమవుతుందని, ప్రతి రైతు తన భూమి స్వభావాన్ని తెలుసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా చుంచుపల్లి మండల పరిధిలోని ఎస్‌సీబీ నగర్ రైతు వేదికలో సోమవారం నిర్వహించిన "రైతు మహోత్సవం - రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాస్త్రవేత్తలతో చర్చించి భూమిలోని ఖనిజాల స్థితి, పీహెచ్ విలువలు, నేల స్వభావం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.​అనంతరం ఆయన రైతు ఉద్దేశించి మాట్లాడుతూ... మనిషికి రక్తపరీక్షలు ఎంత అవసరమో, భూమికి కూడా పరీక్షలు చేసి దాని ఆరోగ్యాన్ని కాపాడటం అంతే ముఖ్యమని వివరించారు. భూమికి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుంటేనే రైతులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందన్నారు. సాగు ఖర్చులను తగ్గించుకోవాలని, ముఖ్యంగా అవసరానికి మించి యూరియా, ఇతర రసాయనాల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. మార్కెట్‌లో ఏ పంటకు డిమాండ్ ఉందో గమనించి అవే పంటలు సాగు చేయాలని, సాగునీటిని ఆదా చేస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ప్రకృతిని కాపాడుతూ నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చని తెలిపారు. ఏడు రోజుల పాటు సాగే ఈ అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని, రైతుల పిల్లలు కూడా ఈ వృత్తిపై మక్కువ పెంచుకుని ఆధునిక పద్ధతులతో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. శాస్త్రం తోడైతేనే రైతు భవిష్యత్తు బలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో మేయర్ గణేష్ చౌహన్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితా కుమారి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :