తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కీలక ఆదేశాలు.పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన ఎస్పీ. చంద్రుగొండ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం నాడు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విధుల నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని, స్టేషన్ రికార్డులను, క్రైమ్ ఫైల్స్ ను పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగింది. సిబ్బందితో ఎస్పీ మాట్లాడుతూ వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా, త్రవ్వకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమ ఇసుక రవాణా పై ఉక్కు పాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్క పోలీస్ అధికారి మరియు స్టేషన్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విధానాలను అలవర్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.ఈ తనిఖీలో భాగంగా, స్టేషన్కు వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి, తక్షణమే వారికి న్యాయం జరిగేలా చూడాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ