తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 19(తెలుగు వెలుగు)వార్షిక తనిఖీ లో భాగంగా, కొత్తగూడెం డిఎస్పి శ్రీ అబ్దుల్ రెహ్మాన్ జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు .ఆఫీస్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించి ,సంతృప్తి వెలిబుచ్చారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు ,విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో సత్ప్రవర్తనతో మెలగాలని, అంకితభావంతో విధులు నిర్వహించుకోవాలని పలు సూచనలు ,సలహాలు చేశారు .సిబ్బందికి ఏదైనా ఆరోగ్య సమస్యలు గాని, ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ