Monday, 20 April 2026 01:57:12 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు.

Date : 14 July 2025 03:45 PM Views : 601

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు...... ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు కొన్ని. సుజాతనగర్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామం వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి కి సంబంధించి 0.7 కుంటల భూమి కోల్పోయిన చెట్టుపల్లి ప్రభాకర్ రావు అనే రైతు తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదని, కావున త్వరితగతిన నష్టపరిహారం ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఆర్డీవో కు ఎండార్స్ చేయడం జరిగింది. కొత్తగూడెం ఎన్కె నగర్ లో నివాసం ఉంటున్న సాకా ఠాగూర్ s/o పుష్పరాజు గత సంవత్సరం ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి కే ఎల్ ఆర్ కళాశాల నందు జాయిన్ అయ్యానని, కానీ అనారోగ్య కారణం చేత కళాశాలకు వెళ్లలేకపోయానని, తన ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం కళాశాలలను సంప్రదించగా మొత్తం ఫీజు చెల్లిస్తేనే తనకు సర్టిఫికెట్లు ఇస్తామని తెలియజేశారని, తన తల్లిదండ్రులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నామని కావున తనకు తన యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పించవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు.

పాల్వంచ మండలం యానం బైలు గ్రామంలో నివాసం ఉంటున్న ముగితే గురవయ్య s/o వెంకయ్య తనకు పూర్వీకుల నుండి వారసత్వంగా రాజాపురం గ్రామం శివారులో సర్వేనెంబర్ 107/72/1 లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని, ఆ వ్యవసాయ భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూమికి నలువైపులా ఉన్న వ్యక్తులు తన వారసత్వ భూమిని ఆక్రమించుకున్నారని కావున తమ భూమిని సర్వే చేసి తన ఐదు ఎకరాల భూమికి హద్దులు నిర్ణయించేటట్లు చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పాల్వంచ తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు.

ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో నివాసం ఉంటున్న కుంజా తిరుపతమ్మ w/o నరసింహారావు (లేటు) తాను ఒక నిరుపేద గిరిజన మహిళనని, పేదరికం వలన బ్రతుకు దుర్భరంగా మారినందున బ్రతుకుతెరువు కొరకు ఏదైనా పథకం క్రింద రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఐటిడిఏ పిఓ కు ఎండార్స్ చేశారు. అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొంతమంది ప్రజలు తమ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కొరకు ఎంపిక చేసిన జాబితా నుండి అనర్హులను తొలగించి, తమ గ్రామమునందు గల నిరుపేదలకు, వితంతువులు మరియు వికలాంగుల పేర్లు జాబితాలో చేర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ పిడి మరియు అశ్వరావుపేట ఎంపీడీవోకు ఎండార్స్ చేయడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :