తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అశ్వరావుపేట మండలంలో పంచాయతీ ఎన్నికల పరిశీలనలో భాగంగా పర్యటిస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మార్గమధ్యంలో పొలాల వద్ద బాతులను మేపుతున్న కాపరి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా బాతుల పెంపకం విధానం, వాటికి అందిస్తున్న ఆహారం, సంరక్షణ పద్ధతులు, వ్యాధుల నివారణ, మార్కెట్లో లభించే ధరలు, ఆదాయ సాధన అవకాశాలపై ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాతుల పెంపకం తక్కువ ఖర్చుతో నిర్వహించగల ఉపాధి కార్యక్రమమని, రైతులు, పశుపాలకులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ