తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం.విద్యా సాగర్ ఆధ్వర్యం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం, ఇచ్చి సమస్య తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది. 76 జి.ఓ.పేద,మధ్యతరగతి ప్రజలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు నిలిచిపోయాయి.దీని వల్ల అర్హులైన లబ్ధిదారులు తమ హక్కులను కోల్పోతున్నారు మరియు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల పట్టాలు లేకపోవడంతో వారు గృహ రుణాలు పొందలేకపోతున్నారు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, మీ గౌరవ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి,జీవో నెంబర్ 76 కారణంగా ఆగిపోయిన ఇళ్ల పట్టాలను పరిశీలించి అర్హులైన వారికి తక్షణమే మంజూరు చేయించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ,ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు, కొత్తగూడెం శాసనసభ్యులు ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు..మమ్మల్ని గెలిపించండి తప్పకుండా పట్టాలు ఇప్పిస్తాను అన్న శాసనసభ్యుడు ఎక్కడ అని అన్నారు, రెండున్నర సంవత్సరాలైనా ఆ దిశగా అడుగులు వేయకపోవడాన్ని కొత్తగూడెం పట్టణ ప్రజలు గమనిస్తున్నారని,రాబోయే ఎన్నికలలో ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు,ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు నోముల రమేష్, కనుకుంట్ల రాజమౌగిలి, వీరు,శశిధర్,మరియు చారి పాలొగొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ