తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండ్ల స్థలాలపై పలుమార్లు సీఎంకు విన్నవించా పండుగ వాతావరణంలో కొత్తగూడెం ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే విషయమై ఇప్పటికే పలుమార్లు సీఎంతోనూ మాట్లాడనని అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కొత్తగూడెం ప్రెస్ క్లబ్ను కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్తో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జర్నలిస్టుల కోసం కొత్తగూడెంలో పది ఎకరాల స్థలాన్ని ఇతరత్రా వాటికి కేటాయించకుండా కాపాడుతున్నానన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తాను ఎప్పుడు అండగా ఉంటానన్నారు. నగరంలో సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా హామీలతోనే కాలం వెళ్లబుచ్చిందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇండ్ల స్థలాల విషయంలో జాప్యం చేస్తుండడం బాధాకారమన్నారు. ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో వెలుగు స్టాఫ్ రిపోర్టర్ కీలక భూమిక పోషించడం అభినందనీయమన్నారు. ఈ ప్రోగ్రాంలో సీనియర్ రిపోర్టర్లు పోతు రాజేందర్, లోగాని శ్రీనివాస్, ఇమంది ఉదయ్ కుమార్, యెర్రా ఈశ్వర్, జునుమాల రమేష్, కల్లోజి శ్రీనివాస్, మోటమర్రి రామకృష్ణ, శంకర్, లక్ష్మణ్, అఫ్జల్, కృష్ణ గోవింద్, కాగితపు వెంకటేశ్వర్లు, నర్సింహ్మ, పండుగ రేశ్వంత్, రవి, రాజేశ్, కుమార్, నాగాచారి, భాస్కర్, సురేష్, పూర్ణ, పాపారావు, రాజేష్, కృష్ణారావు, సుధాకర్, శ్రీనివాస్, షఫి, ఉమాకాంత్, ప్రసాద్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ