తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములును సన్మానించిన పాల్వంచ నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నాగా సీతారాములు నియామకం ద్వారా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారిని అధిష్టానం ఎన్నడు మర్చిపోదని మరోసారి రుజువు చేసినట్టు అయిందని పాల్వంచ కాంగ్రెస్ నాయకులు అన్నారు. పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో నాగా సీతారాములును పాల్వంచ కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్బంగా నూకల రంగారావు మాట్లాడుతు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించడం హర్షించతగ్గ విషయమని, 30 సంవత్సరాలనుండి పార్టీ అభివృద్ధి కోసం చేస్తున్న నాగా సీతారాములుకు పదవీ రావడం ఆనందంగా ఉందని తెలిపారు. కష్టపడే వారికి పదవులు రావడం ఎంతో సంతోషకరమని చెప్పారు. అన్ని వేళల కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా ఉండే నాగా సీతారాములు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ