Friday, 19 June 2026 04:30:45 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

మునగ సాగు తో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 18 October 2024 06:17 PM Views : 697

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ ది వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన లతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏపీవోలు, ఏపిఎంలు మరియు ఈసీఎస్ లతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ మన జిల్లాలో లోని రైతులు వరి, పత్తి మరియు మొక్కజొన్న పంటలు పండించడానికి ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఎకరానికి 20000 నుండి 30000 వరకు మాత్రమే లభిస్తుందన్నారు. రైతుకుఅధిక లాభం పొందేలా మనం ఉపాధి హామీ పథకం ద్వారా చేయవచ్చని తెలిపారు. మునగ సాగు ఎందుకు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఎండాకాలంలో పొలాలు ఖాళీగా ఉంటాయని ఇప్పుడు వచ్చిన పంట డబ్బులు నుంచి కేవలం 10000 రూపాయలు పెట్టుబడి ద్వారా అంటే 2000 రూపాయలు విత్తనాలు, 2000 రూపాయలు ప్లాస్టిక్ బ్యాగులకు ఇంకా మట్టి ఎరువులకు తదితర ఖర్చులకు ఈ పెట్టుబడే డబ్బులు కూడా రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా మొక్క పెట్టుబడి కింద ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎండాకాలంలో రైతులు పొలంలో ఖాళీగా ఉంచకుండా మునగ సాగు చేయాలని, దాని ద్వారా అధిక ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మునగ సాగు లో మునగ ఆకు పొడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ప్రస్తుతం మార్కెట్లో మునగాకు పొడి ధర కేజీ వెయ్యి రూపాయలు గా ఉందని చెప్పారు.అదేవిధంగాఒకవేళ కాయలు పెద్దవిగా అయ్యి ఎండిపోయినప్పటికీ, ఆ గింజ ద్వారా వచ్చే నూనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని ప్రస్తుతం మార్కెట్లో లీటర్ మునగ నూనె ధర 3000 గా ఉందని, ఏ విధంగా చూసినప్పటికీ మునగ సాగు లాభదాయకమని అన్నారు. కేవలం 10000 రూపాయల పెట్టుబడితో 90 వేల నికర ఆదాయం, మళ్లీపెట్టుబడి 10000 ఉపాధి హామీ పథకం కిందతిరిగి వస్తుందని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో పదివేల ఎకరాలు మునగ సాగు జనవరిలో చేపట్టే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు కల్లా మొదటి విడత సాగులో కు రైతులకు సంబంధించిన వివరాలు, రైతు పేరు, చిరునామా, రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, మునగ సాగుకు అంగీకరించారు, నీటి లభ్యత, బోరు ఉందా లేదా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. తదుపరి రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు వివరాలు ఒకవేళ రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు లేనట్లయితే కార్డ్ ఇప్పించాలి అని తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న పత్తి వరి ఆయిల్ ఫామ్ సాగు లో కేవలం మూడు శాతం మునగ సాగు చేసే లా చర్యలు చేపట్టాలని అదికాలను ఆదేశించారు. గుండాల ఇల్లందులో మొక్కజొన్న,పత్తి మొత్తం 32 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది అని దీనిలో 1400 ఎకరాల్లో మునగ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిన్న,సన్నకారు రైతులు మునగ సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు. మునగ సాగు ఎలా చేయాలి, ఏం ఎరువులు వాడాలి దానిలో వచ్చే లాభాలు గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు అందజేస్తామని తెలిపారు.మునగ సాగు చేసే ప్రతి రైతు గట్టు పైన వెదురు మొక్కలు పెంపకం చేపట్టాలన్నారు.మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర పంటగా మునగ సాగు తప్పనిసరి అని అన్నారు. జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో చాలా ఎకరాల ఖాళీ ప్రదేశాలు ఉన్నాయని, ఆ ప్రదేశాలను వెదురు మొక్కలతో నింపాలని ఆదేశించారు. జిల్లాలోని కాలువలకు ఇరువైపులా జామాయిల్,వెదురు,సుబాబులు మొక్కలు నాటాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో పుట్టగొడుగులపెంపకం, చేపల పెంపకం అధిక సంఖ్యలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అజోల్ల సాగు నీటి లభ్యత పై ఆధారపడి ఉంటుందని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యత ఉంటే అజోల్ల సాగు చేపట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డిఆర్డిఓ ఎన్ రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ పృథ్వి, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: