తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలంలోని సాయి ఎక్సెలెంట్ పాఠశాలలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గాదె శ్రీ లక్ష్మి పాఠశాల డిజిటలైజేషన్ కి సంబంధించి బ్రోచర్ ను శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం అభినందించదగిన విషయం అన్నారు. అదేవిదంగా గత ఏడాది విద్యా సంవత్సరంలో సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 10 నవోదయ సీట్లు, 70 గురుకుల సీట్లు సాధించడం కూడా చాలా సంతోషమన్నారు. విద్యార్థులు విని నేర్చుకోవడం కాకుండా చూసి నేర్చుకుంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అని మేధావులు, విద్యావంతులు, కార్పొరేట్ విద్యాసంస్థలు డిజిటలైజేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని మన మండలంలో కూడా అదే స్థాయిలో సాయి ఎక్సలెంట్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలకు కూడా మంచి విద్యావంతులుగా చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ఆరేబోయిన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పల్లె, పల్లెకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్దేశంతో 2026 -2027 విద్యా సంవత్సరానికి ముందుకు అడుగులు వేసేదానిలో భాగంగా డిజిటల్ క్లాసులను కార్పొరేట్ లీడ్ అనే సంస్థ తో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు సిఐ గాదె శ్రీ లక్ష్మిని శాలువాకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా సెక్రటరీ, సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ జోహార్ జో, విశ్వశాంతి పాఠశాల కరస్పాండెంట్ నరసింహారావు, సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన నాగలక్ష్మి, జక్కుల శివకుమారి, ఉపాధ్యాయులు నాగరాజు, అనిత, అశోక్, నభీన, దుర్గ భవాని, సత్యవతి, రమేష్, ఉదయభాను, పావని, సరిత, కళ్యాణి, ప్రశాంతి, భార్గవి, నందిని, అరుణ, స్వాతి, త్రివేణి, శిరీష, రిచిత, అరుణ, రమాదేవి, సౌజన్య, త్రివేణి, సునంద, హైమావతి, శాంతమ్మ, భాస్కర్, విద్యార్థుల తల్లిదండ్రులు K.రమేష్, sk. చాంద్, v. చందర్, A. అశోక్, అచ్చయ్య, సమీర్, సునీత తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ