Monday, 20 April 2026 01:40:26 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

సాయి ఎక్సలెంట్ పాఠశాల డిజిటలైజేషన్ చేయడం అభినందనీయం, సీఐ శ్రీ లక్ష్మి

Date : 31 January 2026 02:10 PM Views : 729

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 31 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలంలోని సాయి ఎక్సెలెంట్ పాఠశాలలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గాదె శ్రీ లక్ష్మి పాఠశాల డిజిటలైజేషన్ కి సంబంధించి బ్రోచర్ ను శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం అభినందించదగిన విషయం అన్నారు. అదేవిదంగా గత ఏడాది విద్యా సంవత్సరంలో సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 10 నవోదయ సీట్లు, 70 గురుకుల సీట్లు సాధించడం కూడా చాలా సంతోషమన్నారు. విద్యార్థులు విని నేర్చుకోవడం కాకుండా చూసి నేర్చుకుంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అని మేధావులు, విద్యావంతులు, కార్పొరేట్ విద్యాసంస్థలు డిజిటలైజేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని మన మండలంలో కూడా అదే స్థాయిలో సాయి ఎక్సలెంట్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలకు కూడా మంచి విద్యావంతులుగా చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ఆరేబోయిన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పల్లె, పల్లెకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్దేశంతో 2026 -2027 విద్యా సంవత్సరానికి ముందుకు అడుగులు వేసేదానిలో భాగంగా డిజిటల్ క్లాసులను కార్పొరేట్ లీడ్ అనే సంస్థ తో ఒప్పందం చేసుకొని నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు సిఐ గాదె శ్రీ లక్ష్మిని శాలువాకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యాసంస్థల జిల్లా సెక్రటరీ, సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ జోహార్ జో, విశ్వశాంతి పాఠశాల కరస్పాండెంట్ నరసింహారావు, సాయి ఎక్సలెంట్ పాఠశాల డైరెక్టర్లు ఆరెబోయిన నాగలక్ష్మి, జక్కుల శివకుమారి, ఉపాధ్యాయులు నాగరాజు, అనిత, అశోక్, నభీన, దుర్గ భవాని, సత్యవతి, రమేష్, ఉదయభాను, పావని, సరిత, కళ్యాణి, ప్రశాంతి, భార్గవి, నందిని, అరుణ, స్వాతి, త్రివేణి, శిరీష, రిచిత, అరుణ, రమాదేవి, సౌజన్య, త్రివేణి, సునంద, హైమావతి, శాంతమ్మ, భాస్కర్, విద్యార్థుల తల్లిదండ్రులు K.రమేష్, sk. చాంద్, v. చందర్, A. అశోక్, అచ్చయ్య, సమీర్, సునీత తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :