తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులై 9న తలపెట్టిన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం కొత్తగూడెం లోని రైటర్ బస్తీ IFTU కార్యాలయం నందు ముఖ్య సమావేశం జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు,జిఎల్బి కేస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చారువాక, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు కోటయ్య పాల్గొని ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది అమరుల త్యాగంతో సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోఢ్ లు గా తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని వారన్నారు ఈ దేశంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వo కనీస వేతనాలను అమలు చేయడం లేదని వారన్నారు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని వాటిని భర్తీ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని వారు విమర్శించారు. పారిశ్రామిక రంగాలను జాతీయం చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని వారన్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పర్మినెంట్ చేయాలని పెండింగ్లో ఉన్న 57 జీవోలని అమలు చేయాలని వారు అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే పనిచేస్తుందని కార్మిక వర్గం కోసం పనిచేసే విధంగా లేదని వారు అన్నారు అందులో భాగంగానే ఖనిజ సంపద ఉన్న దగ్గర ఆయా రాష్ట్రాల పర్మిషన్లు లేకుండానే కార్పొరేట్ శక్తులైన ఆదాని అంబానీలకు తాకట్టు పెడుతున్నారని వారన్నారు. మరోపక్క రాష్ట్రాలకు ఉన్న హక్కులని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వమే ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుందని వారు విమర్శించారు ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు కర్షకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్ జిల్లా కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు జిల్లా నాయకులు వాసు,వివిధ కార్మిక సంఘాల నాయకులు శ్రీను కృష్ణ శరత్ రామకృష్ణ రాజేష్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ