Friday, 19 June 2026 04:31:44 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

"డ్రగ్స్‌కు నో చెప్పండి – సమాజాన్ని కాపాడండి"టూ టౌన్ సీఐ ప్రతాప్

Date : 25 June 2025 10:20 AM Views : 745

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలిటెక్నిక్ కళాశాల లో టూ టౌన్ పోలీసుల అవగాహన కార్యక్రమం . మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని "ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. డ్రగ్కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా ఉండాలి మరియు బాధ్యతగా ఉండాలి" అని టూ టౌన్ సీఐ ప్రతాప్ అన్నారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డిఎస్పీ అబ్దుల్ రహమాన్ ఆదేశాల మేరకు టూ టౌన్ సీఐ ప్రతాప్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టూ టౌన్ సీఐ ప్రతాప్ మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటుపడి యువత తమ మేధాశక్తిని వృథా చేసుకోకూడదన్నారు. డ్రగ్స్ ఒకసారి వాడినా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని యూత్ సోషల్ స్టేటస్, ఫ్యాషన్గా ఎంచుకుంటోందని, దీనిద్వారా విలువైన జీవితాలు నష్టపోతారని ఆయన అన్నారు. భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపితే రోడ్డు ప్ర మాదాలు సంభవిస్తాయన్నారు. సహనం కోల్పోయి ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాలాంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలుపాటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. స్కూళ్లు, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నా, విక్రయిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది మరియు టూ టౌన్ పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :