Monday, 20 April 2026 01:44:20 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 30 July 2025 04:49 PM Views : 445

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మండలం తోగ్గూడెం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించి ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్ లో గ్రిడ్ నుండి నీటి ప్రవాహం, నీటి నిల్వ సామర్థ్యం, రోజువారి మండల డిమాండ్, గ్రామాల వారిగా నీటి సరఫరా స్థితిగతులను తదితర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్లో వివిధ దశల్లో అమలవుతున్న నీటి శుద్ధి ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ప్రతి దశలో చేపడుతున్న పరీక్షలు, శుద్దీకరణ పద్ధతులు మరియు ల్యాబ్ పరీక్షల ప్రమాణాలను గురించి అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ నిర్వహణలో ఉన్న సాంకేతిక పరికరాలు, ఫిల్టర్ల పనితీరు మరియు కెమికల్ డోసింగ్ గురించి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీటి కాలుష్యం పెరుగుతుందని దానికి అనుగుణంగా, నీటి శుద్ధి పరీక్షలు నిర్వహించి పరిశుభ్రమైన నీరు సరఫరా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వాటర్ ఫిల్టర్ బెడ్ భవనం పైన సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ప్లాంట్ ఆవరణంలో ఖాళీ ప్రదేశం అధికంగా ఉన్నందువలన ఆదాయాన్ని చేకూర్చే మొక్కలను నాటాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నలిని, పాల్వంచ తాసిల్దార్ ధారా ప్రసాద్, మిషన్ భగీరథ గ్రిడ్ డి ఈ సాయి, ఏఈ వెంకటేష్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :