Sunday, 19 April 2026 03:01:44 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

సాయి ఎక్స్ లెంట్ స్కూల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు

Date : 31 December 2024 07:32 PM Views : 444

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 31 (తెలుగు వెలుగు) : మండలకేంద్రమైన జూలూరుపాడులో గల సాయి ఎక్సలెంట్ స్కూల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరు సుఖ సంతోషాలతో, అప్లైశ్వర్యాలతో ఉండాలని, విద్యార్థులు మంచిగా చదివి పరీక్షలు బాగా రాసి ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. గత సంవత్సరంలో వచ్చిన నవోదయ సీట్ల కంటే ఈ నూతన సంవత్సరంలో నవోదయ సీట్లు, గురుకుల సీట్లు, ఏకలవ్య అత్యధిక సీట్లు సాధించి, జిల్లా, మండల స్థాయిలో స్కూల్ పేరును ఇనుమడింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్ధినీ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు డైరెక్టర్ శివకుమరీ B. సరిత సుజాత వీరభద్రమ్ అనిత నబీన, దుర్గా భవాని, సాహితి, , పద్మ సత్యావతి, నాగలక్ష్మి, సరిత భాను,అఖిల రజిత అరుణ రేష్మ నందిని ప్రశాంతి రాంకుమార్ మృదుల్ రాంబాబు శాంతమ్మ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :