తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సమైక్యత మరియు సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన జూన్ 23, 1953న కశ్మీర్ సమస్యపైన పోరాడుతూ అసువులు బాసారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడిగా, ఆయన జాతీయ విధానాలపై బలమైన ముద్ర వేశారు. ఆయన ఆశయాలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని, బలమైన మరియు సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం అందరం కృషి చేయాలి. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏ దేశమే దో విధాన్ దో సమిధన్ దో నిషాన్ నైచలేగా నయించలేగ అనే నినాదాన్ని కాశ్మీరీ ప్రజల కోసం భారతదేశ ఐక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు ఆనాడు భారతీయ జనసంఘ్ యొక్క స్ఫూర్తిదాయకమైన విధానాలని భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడానికి తోడ్పాటును అందించాయి ఆ యొక్క స్ఫూర్తితోనే భారత ప్రధాని ఆర్టికల్ 317 రద్దుచేసి కాశ్మీరీ ప్రజలకి స్వేచ్ఛ వాయువులని ప్రసాదించడంలో భారతీయ జనతా పార్టీ సఫలమైందని వివరించడం జరిగింది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాల అనుగుణంగా భారతీయ జనతా పార్టీ సమృద్ధ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ రాబోవు తరాలు కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ చూడబోతుంది అని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు సలీం, జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిపాటి రవీందర్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రేపాక రమేష్, ఎస్ ఐ ఆర్ జిల్లా కన్వీనర్ మోహన కృష్ణ , జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మ, రాజేష్ గారు బడే రమేష్, వంశి, జిల్లా మీడియా కన్వీనర్ రామారావు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ