తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కమ్యూనిస్ట్ నాయకులు బేతి లక్ష్మీనారాయణ (70) ఈరోజు ఉదయం గుండెపోటు తో పరమపదించారు. ఆంధ్ర ప్రజానాట్యమండలితో కళాకారునిగా సామాజిక అవగాహన కల్పిస్తూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో సిపిఎం పార్టీలో చివరివరకు నిస్వార్థంగా కొనసాగారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. లక్ష్మీ నారాయణ ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు కాసాని ఐలయ్య వియ్యంకులు. గాజులరాజం బస్తీ లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. సౌమ్యుడు నిస్వార్ధపరుడు అయిన లక్ష్మినారాయణ అకాల మరణంతో కుటుంబ సభ్యులు బస్తీ వాసులు దిగ్బ్రాంతికి గురయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ