తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్… దమ్మపేట నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలపై చర్చ. హైదరాబాద్ః రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి ముందస్తుగా తీసుకోవల్సిన చర్యలపై అన్ని జిల్లాలల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండేలా ముందస్తుగా తెలియజేయాలని వ్యవసాయశాఖ మంత్రికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు, పంటలకు వచ్చిన ముప్పేమి లేదని, ఒకవేళ భారీగా వర్షాలు పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రిగారికి తెలిపారు. దూర ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా యూరియాపై ముఖ్యమంత్రి అడగగా.. నిన్నటి నుంచి మాత్రమే మనకి రామగుండం నుండి యూరియా సరఫరా మొదలైందని, రోజుకు ఒక rake యూరియా సప్లై చేస్తున్నారని, దానిని డిమాండ్ ఉన్న జిల్లాలకు పంపించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే తాను 4 సార్లు, స్వయంగా ముఖ్యమంత్రి 4 సార్లు కేంద్ర ఎరువులు, రసాయనలు శాఖ మంత్రి నడ్డాగారిని కోరిన, కేంద్రం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని, 4 నెలల నుండి వారు కేటాయించిన విధంగా ఎప్పుడూ పూర్తిగా సరఫరా చేయలేదని, మన దగ్గర ఉన్న బఫర్ స్టాక్ తోనే ఇప్పటివరకు సర్ధుబాటు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెలలో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుందని, వరి నాట్లు కూడా 15 వరకు అయిపోతాయని, యూరియా ధరలు తక్కువగా ఉండటం వలన కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరత ఉందని, కేంద్రం నుండి అవసరం మేరకు యూరియా రాకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఢిల్లీలోని మన రాష్ట్ర ఎంపీలను కేంద్ర మంత్రి జెపి నడ్డా గారిని కలిసి మరోసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా గురించి అడిగేవిధంగా సూచించాలని ముఖ్యమంత్రిగారిని ఈ సందర్భంగా మంత్రి కోరడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ