తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలోని జె.వి.ఆర్ ఓసి నందు హెడ్ ఓవర్ మెన్ గా పనిచేయుచున్న విజయగిరి శ్రీనివాస్ కుమారుడు విజయగిరి సంతోష్ ఐఐటి ముంబై నందు కెమికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యను అభ్యసించుచున్నాడు అతనికి ఈ సంవత్సరముకు గాను లక్ష రూపాయల చెక్కును కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజు తేదీ:31.10.2025 (శుక్రవారం) న కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం నందు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యలు అభ్యసించుటకు సింగరేణి సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. మరి ముఖ్యంగా ఈరోజు చెక్కులు తీసుకుంటున్న విజయగిరి శ్రీనివాస్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సింగరేణిలో పనిచేయుచున్న ఉద్యోగుల పిల్లలు వీరిని ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత చదువులను అభ్యసించి, ఉన్నత శిఖరాలను అవరోదించాలని కొత్తగూడెం ఏరియా ఉద్యోగులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వి.మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్, డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, మేనేజర్ పద్మావతి ఖని ఎం.వి.ఎన్. శ్యామ్ ప్రసాద్, డివై పిఎం జి. హరీష్, సీనియర్ పిఓ మజ్జి మురళి ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ