తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇటీవల కాలంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న బృందావనం బ్రిడ్జి మలుపు ప్రదేశాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావనం బ్రిడ్జ్ మలుపు వద్ద రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి తగు చర్యలను చేపట్టాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గురువారం ఆర్&బి అధికారులు,సంభంధిత పోలీస్ అధికారులతో కలిసి ఆ ప్రదేశాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. బృందావన్ బ్రిడ్జి టర్నింగ్ పాయింట్ వద్ద భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలు ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నందున, అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.కొత్తగూడెం నుండి ఖమ్మం వైపుగా,ఖమ్మం నుండి కొత్తగూడెం వైపుగా ప్రయాణించే వాహనదారులు ఇట్టి మూల మలుపు వద్ద తమ వాహనాల వేగాన్ని తగ్గించుకునే విధంగా చర్యలు చేపడతామని అక్కడ ఉన్న అధికారులు ఎస్పీ కి వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,ఆర్&బి ఈఈ నాగేశ్వరరావు,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,వన్టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,ఎస్సైలు రమణారెడ్డి,ప్రవీణ్,రమాదేవి,ఉమ మరియు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ