తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేధింపులు భరించలేక కొడుకు కు ఉరి వేసి చంపిన తల్లీ కొత్తగూడెం, మార్చి 20, : కొడుకు మధ్యానికి బానిస అయి, నిత్యం వేదిస్తూ ఉండటం తో తల్లీ కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి, ఉరి వేసి చంపేసిన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ లో చోటు చేసుకుంది. ఎస్సై రమణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎదురుగడ్డకు చెందిన రాజకుమార్ (40) మద్యానికి బానిస అయి నిత్యం భార్య, పిల్లలు, తల్లిని వేదిస్తున్నారు. భర్త వేధింపులు భరించలేక అతని భార్య సుకన్య కూతురికి ఉరి వేసి, తను ఉరి వేసుకుంది. ఇది చూసిన తల్లీ దూడమ్మ కోడలిని కాపాడింది సుకన్య కూతురు చనిపోయింది.అయిన ఇలా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.గురువారం కూడా బాగా తాగి ఇంట్లో గొడవ పడి వేదిస్తున్న కొడుకును చంపాలని నిర్ణయించుకుంది.మద్యం మత్తులో నిద్ర పోతున్న కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి ఉరి వేసి చంపింది. ఈ విషయం కోడలు సుకన్యకు చెప్పింది. సుకన్య ఈ విషయాన్ని లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ