Sunday, 19 April 2026 05:56:53 PM
# మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె.

సీఎం కప్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 05 January 2026 05:45 PM Views : 278

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీఎం కప్ క్రీడా పోటీలను జిల్లాలో విజయవంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణపై క్లస్టర్ ఇన్చార్జిలు , ఎంఈఓ లు , డీఈవో , డిపిఓ సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే సీఎం కప్ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీలు ఐదు దశలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు ఈ నెల 17 నుండి 22 వరకు, మండల స్థాయి పోటీలు ఈ నెల 28 నుండి 31 వరకు, నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుండి 7 వరకు, జిల్లా స్థాయి పోటీలు ఫిబ్రవరి 10 నుండి 14 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నాలుగు దశల పోటీల్లో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొనే అర్హత పొందుతారని చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి 19 నుండి 26 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. గ్రామస్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణ కోసం జిల్లాను 77 క్లస్టర్లుగా విభజించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామీణ స్థాయిలో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పోటీలు సక్రమంగా నిర్వహించేందుకు ఎంఈఓలు, సీఆర్పీలు, పంచాయతీ సెక్రటరీలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని క్రీడలను విజయవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ క్రీడలతో పాటు ఫుట్‌బాల్ పోటీలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో వివిధ రకాలైన మొత్తం 21 క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో సీఎం కప్ క్రీడా పోటీలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని, క్రీడల్లో పాల్గొనదలచిన వారు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేలా అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్ (satg.telangana.gov.in/cmcup) లేదా ‘CM Cup’ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి ప్రభుత్వం సర్టిఫికేట్లు అందజేస్తుందని అన్నారు. పోటీల నిర్వహణకు అవసరమైన మైదానాలను సిద్ధం చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం రెండు మైదానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక మైదానాన్ని బాలుర పోటీలకు, మరో మైదానాన్ని బాలికల పోటీలకు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు మండల స్థాయికి, మండల స్థాయి నుంచి గెలుపొందిన వారు నియోజకవర్గ స్థాయికి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి, అనంతరం రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ వివరించారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో విద్యార్థులు, యువకులతో పాటు అన్ని వయసుల క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రీడాప్రియులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :