తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్తీక పౌర్ణమి సందర్భంగా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామం పాలగుట్టపై కొలువుదీరి ఉన్న శ్రీ రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి గ్రామం నుండి ఎడ్లబండ్లతో ప్రభలను కట్టుకొని స్వామివారి గుడి ప్రదక్షిణలు నిర్వహించారు. పాలగుట్టపై నాగేంద్రుని విగ్రహం వద్ద పుట్టలో పాలు పోసే సాంప్రదాయం అనాదిగా ఉంది. కాకర్ల గ్రామం మరియు చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలో చిన్నపిల్లలకు చెవులు చెవులకుట్టుట కార్యక్రమాలు పాలగుట్టపై ఉన్న నాగేంద్ర స్వామి దగ్గర చేస్తూ ఉంటారు. కార్తీకమాసం వచ్చిందంటే భక్తులు నిత్యం భక్తులతో రద్దీగా ఉండే పాలగుట్ట పౌర్ణమి రోజు న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ