తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ఉప్పెర్ల అఖిల్ డెంగ్యూ జ్వరంతో మరణించారు. ఈ మరణ వార్త తెలుసుకున్న కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య వారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ప్రాణాల మీదకు వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ