Monday, 20 April 2026 01:52:54 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

కొత్తగూడెం నియోజకవర్గంలో పాడైన రోడ్లను బాగు చేయాలి - కాపు సీతాలక్ష్మి

Date : 27 October 2025 02:32 PM Views : 330

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి, గోధుమ వాగు బ్రిడ్జి పై పడ్డ గుంతల వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ మీద పెట్టే శ్రద్ధ ప్రజా పాలన మీద లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 22 నెలల కాలం గడుస్తున్న పాడైన రోడ్ల వద్ద తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని మండి పడ్డారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవని అన్నారు. పాడైన రోడ్లను బాగు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామిని అమలు చేయలేదని, 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను దగా చేశారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే విద్యార్థినికి స్కూటీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2500 వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. తక్షణమే రోడ్లను బాగు చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబుల వేణు, లక్ష్మీదేవి పల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, పూర్ణచందర్ నాయక్, బాబుజానీ, మధు, నిజాం, హైమద్, అశోక్, రాసపల్లి శీను, సురేందర్, బాబా, అమన్, మనోజ్, యుగంధర్, చందు, షణ్ముఖ సాయి, అబ్బు, చందు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :