తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం, జులై 11 (తెలుగు వెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మండలం లోని హేమచంద్రపురం లో గల బికేసిఏ క్రీడా మైదానంలో "అండర్ – 12 క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ –2025" టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ BKCA U-12 వర్సెస్ NCA తల్లాడ జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది. ఈ మ్యాచ్ లో BKCA U-12 జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగిన పండుగ ఉజ్వల్ మహంత్ 13.3 ఓవర్ల వరకు లాంగ్ స్టాండింగ్ బ్యాట్స్మెన్ గా నిలిచి 35 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ గా నిలిచాడు. 2వ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన NCA తల్లాడ జట్టు 16 ఓవర్ల నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. 2వ ఇన్నింగ్స్ లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన నిఖిల్ బెస్ట్ బౌలర్ రాణించాడు. ఈ లీగ్ లో మొదటి మ్యాచ్ గెలిచిన BKCA U-12 శనివారం జరగనున్న 2వ లీగ్ మ్యాచ్ లో సంగారెడ్డి జిల్లాకు చెందిన జై క్రికెట్ అకాడమీ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నమెంట్లో BKCA U-12 (కొత్తగూడెం), NCA తల్లాడ, Jai Cricket Academy (సంగారెడ్డి), Nextgen Cricket Academy, SAR Cricket Academy (మణుగూరు) జట్లు పాల్గొననున్నట్లు ఆర్గనైజర్ పంతంగి సాయి నిరంజన్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ