Sunday, 19 April 2026 02:24:10 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెంలో ప్రారంభమైన"అండర్ – 12" క్రికెట్ లీగ్

Date : 11 July 2025 10:24 PM Views : 977

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం, జులై 11 (తెలుగు వెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మండలం లోని హేమచంద్రపురం లో గల బికేసిఏ క్రీడా మైదానంలో "అండర్ – 12 క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ –2025" టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ BKCA U-12 వర్సెస్ NCA తల్లాడ జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది. ఈ మ్యాచ్ లో BKCA U-12 జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగిన పండుగ ఉజ్వల్ మహంత్ 13.3 ఓవర్ల వరకు లాంగ్ స్టాండింగ్ బ్యాట్స్మెన్ గా నిలిచి 35 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ గా నిలిచాడు. 2వ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన NCA తల్లాడ జట్టు 16 ఓవర్ల నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. 2వ ఇన్నింగ్స్ లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన నిఖిల్ బెస్ట్ బౌలర్ రాణించాడు. ఈ లీగ్ లో మొదటి మ్యాచ్ గెలిచిన BKCA U-12 శనివారం జరగనున్న 2వ లీగ్ మ్యాచ్ లో సంగారెడ్డి జిల్లాకు చెందిన జై క్రికెట్ అకాడమీ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నమెంట్లో BKCA U-12 (కొత్తగూడెం), NCA తల్లాడ, Jai Cricket Academy (సంగారెడ్డి), Nextgen Cricket Academy, SAR Cricket Academy (మణుగూరు) జట్లు పాల్గొననున్నట్లు ఆర్గనైజర్ పంతంగి సాయి నిరంజన్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :