Thursday, 25 June 2026 08:05:31 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

Date : 24 June 2026 06:25 PM Views : 43

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్కర సమయాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలబడాలి.జిల్లా పోలీస్ శాఖ తరఫున DDRF బృందాలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద జరుగుతున్న డిడిఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ రోహిత్ రాజు బుధవారం నాడు సందర్శించారు. ​శిక్షణా శిబిరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి అందుతున్న శిక్షణ తీరును పర్యవేక్షించారు. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడంలో, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో డిడిఆర్ఎఫ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శిక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న భాదితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డీడిఆర్ఎఫ్ బృందాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్ని శాఖలతో సమన్వయం పాటిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు.జిల్లాలోని ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణను పొందిన డిడిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ముఖ్యంగా గోదావరి నది వరదలు సంభవించినప్పుడు నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే లోతట్టు ప్రాంత ప్రజలను సంరక్షించడానికి ఈ బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్,లైఫ్ బాయ్ రింగ్స్, బోట్లు,రోప్స్ మరియు ఇతర సామాగ్రి మొత్తాన్ని శిక్షణ పొందుతున్న బృందాలకు సమకూర్చడం జరిగిందని తెలియజేశారు.విపత్కర సమయాల్లో డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.​ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, అశ్వాపురం సిఐ ఎల్లయ్య, ఆపరేషన్ ఆర్ఐ బి. రవి, ఎస్ఐ రాజేష్, పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, డిడిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :