Monday, 20 April 2026 01:44:20 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ప్రకృతి మాతను కాపాడుకుందాం. ప్రముఖ ప్రకృతి కవి జయరాజు.

Date : 16 February 2026 07:45 PM Views : 279

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ భూమిపైన సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైందని, ప్రకృతి మాతను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ప్రముఖ ప్రకృతి కవి రచయిత డాక్టర్. జయరాజ్ అన్నారు.విజ్ఞాన దర్శని, దీ నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విజ్ఞాన యాత్రలో భాగంగా, యాత్ర బృందం శనివారం కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ప్రేమికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక పోరాటాల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని, దాన్ని సఫలీకృతం చేసేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారనీ వెల్లడించారు. ఇటీవల రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుందని దాన్ని అర్థం చేసుకుని, రాజ్యాంగ రక్షణకు పాటుపడాలని కోరారు. ప్రపంచంలో క్యాన్సర్ వీరవిహారం చేస్తున్నదని, ప్రాణాంతకమైన క్యాన్సర్ని రూపుమాపేందుకు మనమందరం నిత్యజీవితంలో ప్లాస్టిక్ ని రూపు మాపాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రకృతి పైన, రాజ్యాంగం పైన, సైన్స్ పైన, అవగాహనను కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని, దాని దానిలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు, ప్రజా వైజ్ఞానికవేత్త రమేష్ మాట్లాడుతూ సైన్సు సాంకేతిక రంగాలలో ప్రపంచం దూసుకుపోతుందని, ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కాలం ఆసన్నమైంది కానీ, మనుషుల్లో మార్పు రాలేదన్నారు. ఒక మెకానికల్ ఇంజనీర్ తన కారుకి చిన్న నట్టు పోతే వేసుకోలేని పరిస్థితి వచ్చింది అన్నారు. ఎలక్ట్రికల్ లో ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకున్నవారు తన ఇంట్లో ఫీజు పోతే వేసుకోలేని పరిస్థితి ఉందని, దాన్నిబట్టి మనం చదివే చదువుల వల్ల ఉపయోగం ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. చదువులతో పాటు సమాజాన్ని చదవాలని అభివృద్ధి చెందుతున్న సైన్స్ ని అందిపుచ్చుకోవాలని అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు అనంతరం ప్రకృతి ఆశ్రమం సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ జయరాజుకు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్_ శోభారాణి దంపతులకు, అవయవ దానం పై అవగాహన కల్పిస్తున్న అమ్మ నేత్ర శరీర అవయవదాన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఈశ్వర్ లింగం లను ఆశ్రమ సభ్యులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. కన్వీనర్ సుగుణా రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు కేహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన యాత్ర చేపట్టడం శుభదాయకమన్నారు.యాత్రకు కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని జాతీయ నాయకురాలు శోభారాణి, రాష్ట్ర కార్యదర్శి మెహర్ అలీ, ప్రకృతి ఆశ్రమం సభ్యులు శనగ వెంకటేశ్వర్లు, మల్లెల రామనాథం, మొక్కల రాజశేఖర్, ఎల్దండి పూర్ణచంద్రరావు, దయానంద సాగర్, బంగారి శంకర్, బిక్కులాల్, నంది శశి కుమార్, శోభారాణి, రఘు లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :