తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అంబేద్కర్ Sk,ఫహీమ్ దాదా బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి రామవరం కబరిస్తాన్ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించిఖబర్స్తాన్ మరియు ఈద్గా కమిటీ అధ్యక్షులు sk, ఫహీమ్ దాదా మాట్లాడుతూ, భారత రాజ్యాంగా నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అట్టడుగు ప్రజలకు ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల అభివృద్ధి తన లక్ష్యమని బ్రిటిష్ పరిపాలనలో దేశ ప్రజలు నలిగిపోయారని స్వసంత్రం అనంతరం ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు స్వేచ్ఛగా సమానంగా జీవించాలని లక్ష్యంతో ఎన్నో కష్టాలు నష్టాలు భరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకుసేచ్చగా మాట్లాడే హక్కును కలుగ చేశారనిఅంతరానితనంతో తనలాంటి వాళ్లే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారనిఅటువంటి సమస్యలు దేశంలో మరల ఉండకూడదనే అందరికీ సమాన హక్కు భారత రాజ్యాంగంలో కల్పించారని, ఎన్నో త్యాగాలతోరూపొందించుకున్నటువంటి ఈ భారతదేశాన్ని కుల మతాల పై రాజకీయాలు చేస్తూకొంతమంది రాజ్యాంగ మూలాలను దెబ్బతీయడానికి చూస్తున్నారని,ఇటువంటి వారిని తరిమి కొట్టే బాధ్యత మనపై ఉందని,కుల మతాల విభేదాలు లేకుండా దేశ అభివృద్ధికి మనమంతా కృషి చేయాలని, పూల మాలలు వేసి ఫోటోకు పాలాభిషేకం చేసినంత మాత్రాన అంబేద్కర్ అభిమానులు కారని ఆయనకు ఈ దేశంలో మనమంతా సమాన హక్కులు పొంది మనమంతా ఐక్యంగా ముందుకు వెళ్లి అంటరానితనాన్ని తరిమి కొట్టినప్పుడే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులు అర్పించినట్టని అంబేద్కర్ నిజమైన వారసులు అభిమానులు అవుతారని ఆయన అన్నారు అంబేద్కర్ భౌతికంగా మన నుంచి దూరం కావచ్చు మనం అనుభవించే ఈ స్వేచ్ఛ ఫలాలు ఉన్నంతకాలం ఆయన మనలో జీవించే ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో,రసూల్, షమ్మీ, ఖయ్యుమ్,ఉస్మాన్,జావీద్,జలీల్, గౌస్, యాకుబ్,జానీ, రఫీ, అలీం, రహీం, జావీద్, బషీర్,యాకుబ్ పాషా. తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ