తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కోత్తగూడెం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వినాయక మండపల కమిటీ వారిని నేడు 1 వ పట్టణ పోలీసులు స్టేషన్ కి ఆహ్వానించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్.. డీఎస్పీ మాట్లాడుతూ....ఈ 27 న వినాయక చవితి పండగ ఉన్నందున ముందస్తుగా వాడ వాడ లో పెట్టె వినాయకుడి మండలను, మండపం పెట్టడనికి తీసుకోవాల్సిన తాగు జాగ్రత్తలు, అనుమతులను, మండపల వద్ద పాటించే నియమ నిబంధాలను కమిటీ వారికీ తెలియచేసారు. మండపాలు రోడ్ ఆక్రమించి పెట్టవద్దని, మండపాల వద్ద సౌండ్ ని పూజ సమయం లో మాత్రమే తక్కువ శబ్దం వచ్చే విదంగా చూడాలి, మండపల వద్ద డి జె సౌండ్ సిస్టం గనీ మద్యం సేవించడం గని, మండపల వద్ద ఎటువంటి అల్లర్లు జరిగిన, అవంచినియా సంఘటనలు జరిగిన కమిటీ వారిదే పూర్తి బాధ్యత వహించాలి. వారి పై చట్ట పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సివుంటుంది. వినాయకుడి ఊరేగింపు లో మద్యం సేవించి డి జె సౌండ్ బాక్స్ లతో నృత్యాలు చేస్తూ ట్రాఫిక్ నియమ నిభందనాలు పాటించక పోయిన కమిటీ బాధ్యత వహించాలి. మండపాల వద్ద ఎవరో ఒకరు ఉండాలి. Fire accidents జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తి శ్రద్దలతో నవరాత్రులు జరుపకోవాలి. ముందస్తుగా ఏ రోజు నిమజ్జనం చేస్తారో తెలియజేయాలి. దాని వాళ్ళ నిమజ్జనం ప్రాంతం లో సరైన బందోబస్త్ నిర్వహించడం జరుగుతుంది. ఏదేని గొడవ జరిగే అవకాశం ఉంటే Dial 100 కి కాల్ చేయండి. గొడవలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలి. నిమజ్జనం రోజున క్రాకర్స్ ని ఉపయోగించారాదు. దాని వాళ్ళ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాము. ఈ కార్యక్రమం లో 1 వ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ , చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. వి. వెంకటేశ్వర్లు, ఎస్ ఐ రమణారెడ్డి, SI రవి, ఎస్ ఐ రాకేష్, ఎస్ ఐ విజయ, ఎస్ ఐ బేగ్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ