Sunday, 19 April 2026 01:58:03 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

అబలలకు అక్షరాయుధాన్ని అందించిన ధీరవనిత సావిత్రిబాయి పూలే. మునిగడప పద్మ.

Date : 03 January 2026 07:58 PM Views : 424

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అబలలకు అక్షర ఆయుధాన్ని అందించిన దీరవనిత సావిత్రిబాయి పూలే అని పదో వార్డు మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ కొనియాడారు. శనివారం జాతీయ మహిళా టీచర్స్ డే సందర్భంగా రామవరం 16వ డివిజన్లో అంగన్వాడి సెంటర్లోని టీచర్లను కలుసుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంగన్వాడి సెంటర్లో పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆమె ఒక ఉపాధ్యాయురాలి గానే కాక ,అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆమె అన్నారు ఆమె తన భర్తతో కలిసి స్త్రీ విద్యను ప్రోత్సహించి సమాజంలో స్త్రీలకు గౌరవాన్ని పెంపొందించిందని ఆమె కొనియాడారు నేటి సమాజంలో ఆమె ఇచ్చిన విజ్ఞానం అక్షర ఆయుధం అజ్ఞానాన్ని తుంచిందని అన్నారు ఒక మహిళా టీచర్ గానే కాకుండా అమ్మలా లాలించి, ఆశయాలను రగిలించి, మన గమ్యాన్ని చూపించే ఓ మహిళా మూర్తిగా ఈరోజు కీర్తింప పడుతుందని అన్నారు. ఇవే మా పాదాభివందనాలు. ఒక మహిళ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూనే స్కూల్లో వందలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం అనేది సామాన్యమైన విషయం కాదు అన్నారు. సావిత్రిబాయి పూలే ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటే నేడు మనం చూస్తున్న ఈ మహిళా శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుందని అన్నారు. నేడు మనమందరం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే అది ఆమె పెట్టిన అక్షర బిక్ష అని అన్నారు. ఆమె ఆరోజు పేడ విసిరిన వారిని భరించి అక్షరాలను మనకు అందించింది. అందుకే ఆమె ప్రతి మహిళా ఉపాధ్యాయురాలికి స్ఫూర్తి ప్రదాత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎన్ సరోజ ,డి నిలవేణి, ఆయా కౌసల్య, సరిత, అంగన్వాడి పిల్లలు, మరియు తల్లులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :