Monday, 20 April 2026 01:53:25 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పారదర్శక పరిపాలన కోసం ఆర్‌టీఐ చట్టం ప్రభావవంతంగా అమలు కావాలి — జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్.

Date : 09 October 2025 08:56 PM Views : 340

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) 20వ వార్షికోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఆర్‌టీఐ 2025 విజేతలకు బహుమతులు అందజేశారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా అదనపు కలెక్టర్‌ డి. వేణుగోపాల్ జిల్లా అధికారులతో కలిసి వీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ — సమాచార హక్కు చట్టం ప్రజలకు పారదర్శక పరిపాలన అందించేందుకు కీలక సాధనం. ప్రజల అభ్యర్థనలపై సమాచారం త్వరితగతిన, సమగ్రంగా అందించాలనే దిశగా ప్రతి అధికారి కృషి చేయాలి అని అన్నారు.ఆర్‌టీఐ చట్టం ద్వారా సమాచారాన్ని వేగంగా, నిష్పాక్షికంగా అందించాలనే సంకల్పంతో జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ డి ఓ సి కార్యాలయం నుంచి సిపిఓ సంజీవరావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, డి సి ఓ రుక్మిణి, ఏడి ఫిషరీస్ ఇంతియాజ్ ఖాన్, అడిషనల్ డి ఆర్ డి ఓ రవి, పౌరసరఫరాల మేనేజర్ త్రినాథ్ బాబు, భూగర్భ జలాల శాఖ అధికారి రమేష్, పరిశ్రమల శాఖ మేనేజర్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :