Sunday, 19 April 2026 03:16:26 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సా శిబిరములు కరపత్రాలు, బ్యానర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

Date : 19 June 2025 08:24 PM Views : 628

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్, వికాస తరంగిణి భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎఐ వాసవి అసోసియేషన్ యుఎస్ఏ వారి సహకారంతో ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సా శిబిరములు నిర్వహించబడుచున్నవి. ఈ ఆరోగ్య శిబిరముల గురించి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తన కార్యాలయంలో కరపత్రములు, బ్యానర్లు గురువారం విడుదల చేసినారు. ఈ ఆరోగ్య శిబిరము భద్రాచలంలోని మారుతి నర్సింగ్ నర్సింగ్ కాలేజి, భద్రాచలం నందు ది.29.06.2025న ఆదివారం మరియు 30.06.2025న సోమవారం దుమ్ముగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించబడునని తెలిపినారు. ఈ శిబిరములో కేన్సర్ లక్షణాలు గల వారికి ప్రఖ్యాతి చెందిన కేన్సర్ వ్యాధి చికిత్సలో నిపుణులైన యంఎన్ జె కేన్సర్ ఆసుపత్రి హైదరాబాద్ 1000 పడకల ఆసుపత్రి వారి బృందముతో పాటు భద్రాచలంకు చెందిన స్త్రీల వైద్య నిపుణురాలు డా.వి. జయభారతి, సర్జికల్ ఆంకాలజిస్టు డా||యం. మధుమోహన్ రెడ్డి నిపుణులైన వైద్యులచే నిర్వహించబడును. ఈ శిబిరములో ఉచితంగా పరీక్షలు చేసి ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఆ పథకం ద్వారా ఉచితంగా వైద్య సేవలందించబడునని, ఈ శిబిరం నిర్వహించుటకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సహకారం, సలహాలతో నిర్వహించబడుతుందని రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా॥ఎస్.ఎల్.కాంతారావు వారికి ధన్యవాదాలు తెలిపినారు. ఈ సదాకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపర్చుకొనగలరని రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా||ఎస్.ఎల్.కాంతారావు, వై. సూర్యనారాయణ, ఎ.జగదీష్, బి. రాజారెడ్డి, డా||బి. సుబ్బరాజు, డా॥యం.మోహన్రావు, వి.కామేశ్వరరావు, డా॥ జివివి సుదర్శన్ రావు, గట్టు వెంకటాచారి, డా|| పి. రాజశేఖర్, లయన్ కమలా రాజశేఖర్, పాకాల దుర్గా ప్రసాద్, డా॥భాను ప్రసాద్ తదితరులు కోరినారు. డా||ఎస్.ఎల్.కాంతారావు,ఐఆర్సిఎస్ జిల్లా కో-ఆర్డినేటర్.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :