తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 22(తెలుగు వెలుగు) ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న డి ఎ, పి ఆర్ సి బిల్లులను వెంటనే విడుదల చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను వెంటనే ప్రకటించాలని నూతన పిఆర్సిని తొందరగా అమలు చేయాలని ఈ కుబేర్ లో ఉన్న వివిధ రకాల మెడికల్ జిపిఎఫ్ సరెండర్ రిటైర్మెంట్ బిల్లులను విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడా కృష్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జలురుపాడు నందు జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరూ స్వచ్ఛందంగా నల్ల బ్యాడ్జీలను ధరించి వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య శాంతకుమారి శ్రీనివాస్ ఉమా శకుంతల ఉమామహేశ్వరి జి వెంకటేశ్వర్లు రామనాథం సునీత సర్దార్ వల్లభాయ్ పటేల్ పద్మ తదితరులు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ