తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 13 తెలుగు వెలుగు) : చుంచుపల్లి రైతు వేదిక నందు వాలంతరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు వ్యవసాయ విస్తరణ అధికారులకు రెండు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఈరోజు ఎం అనిత డైరెక్టర్ ఆఫ్ జనరల్ వాలంటరీ వారు మాట్లాడుతూ ఏ ఈ ఓ లు అందరూ కూడా రైతులకు సాయిల్ కన్జర్వేషన్ మరియు నీటిని ఎలా పొదుపు చేస్తూ వ్యవసాయ దిగుబడులు ఎలా సాధించాలని పేర్కొన్నారు. తక్కువ నీటిని వాడి అధిక దిగుబడులను సాధించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ నవీన్ కుమార్ ఏవో అన్నపూర్ణ . ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి బాబు రావు , వాలంటరీ జెడిఎ గౌరీ ఏ డి ఏ సునీత ,ఏవో ,జిల్లాలోని ఏఈఓస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ