తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు సందర్భంగా మాట్లాడుతూ: యోగ శిక్షణ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్యోగుల ఆరోగ్యపరమైన శ్రేయస్సు మరియు శారీరక-మానసిక ప్రశాంతతకు, ధృఢతమును పెంపొందించడాన్ని తోడ్పడుతుందని, సంస్థ ఉద్యోగుల శ్రేయస్సును పెంపొందిస్తూ, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడమే సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం అని అన్నారు, ఉద్యోగులందరూ యోగ ప్రాముఖ్యత తెలుసుకొని వారి యొక్క రోజువారి కార్యక్రమాలలో కొంత సమయమును యోగాకు కేటాయించి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఉద్యోగులకు తెలియజేశారు. “యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాక, మానసిక స్థిరత్వాన్ని కలిగించే సాధనం. ఇది ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంపొందించి, పనితీరును మెరుగుపరుస్తుంది” అని అన్నారు. "ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక శ్రేయస్సు కోసం యోగ శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి, ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నుండి ప్రతి రోజు ఉదయం 6:30 గంటలకు రుద్రంపూర్ లోని ప్రగతి వనం నందు యోగ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగా లాన్ వద్ద ప్రారంభమవుతుంది, అనుభవజ్ఞులైన యోగ శిక్షకురాలు, ఈ శిక్షణను అందిస్తారు. కావున, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని జిఎం గారు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ