Sunday, 19 April 2026 01:55:43 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ముమ్మరముగా జరుగుతున్న కిన్నెరసాని పైపులైన్ పనులు : పదో వార్డు మార్కెట్లో జరుగుతున్న పైప్లైన్ పనులను పరిశీలించిన పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ, డి

Date : 11 January 2025 06:27 PM Views : 796

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో 124 కోట్లతో జరుగుతున్న పైపు లైన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అన్నారు. స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు కృషితో కొత్తగూడ నియోజకవర్గ మహిళలు మంచినీటిపై పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని 124 కోట్ల రూపాయలు కిన్నెరసాని మంచినీటి పథకానికి మంజూరు చేయించి గత ఆరు నెలల క్రితం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. దానిలో భాగంగా రామవరం లో పైప్ లైన్ నిర్మాణం ముమ్మరంగా సాగుతుందని తెలిపారు. సుమారు ఎనిమిది నెలల్లో సాంబశివ గారు కృషితో మహిళల నీటి కష్టాలు తీరుతాయని ఆమె ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రధాన పైప్లైన్ పనులు పూర్తి కాగానే రామవరం లోని శ్రీనివాస టాకీస్ ఏరియాలో నిర్మాణమైన రెండు అతి పెద్ద ట్యాంకులుకి నీళ్లు ఎక్కించినట్లయితే రామవరం ప్రజల నీటి కష్టాలు తీరుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పైపులైన్ పనులను పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ డి ఈ రవికుమార్ తో కలిసి పనులను పరిశీలించారు. శనివారం మార్కెట్లో ఆమె మాట్లాడుతూ మార్కెట్లో పైప్ లైన్ వల్ల గుంతల మయమైన రోడ్డు ప్లేస్ లో నూతన రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నూతన రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే నిర్మాణ పనులు వ్యాపార వర్గానికి, వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. అలాగే రోడ్డుమీద లేస్తున్న డస్ట్ కు ట్యాంకర్లతో నీళ్లు చల్లి శుభ్రం చేయాలని అధికారులకు కాంట్రాక్టర్ కి సూచించారు. ఈ పనులను పరిశీలించిన మున్సిపాలిటీ డి ఈ రవికుమార్, తో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, ఏరియా పెద్దలు జాకీర్ ,సలీం, సుభాష్, మక్కడు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :